మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 24 గంటల్లో 19 కాన్పులు చేసినట్లు గైనకాలజిస్ట్ హెచ్వోడీ డాక్టర్ వెంకట్రాములు తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 19 కాన్పులు చేసినట్లు ఆయన వివరించారు.
ఇందులో 15మందికి నార్మల్ డెలివరీలు కాగా, మరో నలుగురికి తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ చేయాల్సి వచ్చిందన్నారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ కాన్పులు చేసినందుకు గాను గైనకాలజీ హెచ్వోడీ వెంకట్రాములు, వైద్యులను కలెక్టర్ కే శశాంక, హాస్పిటల్ సూపరింటెంటడెంట్ బి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఆస్పత్రులకు వచ్చే ప్రతి గర్భిణికి నార్మల్ డెలివరీ చేసేందుకే ప్రయత్నిస్తున్నామని డాక్టర్ వెంకట్రాములు చెప్పారు.