Telangana Assembly | హైదరాబాద్ : తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరిన సంగతి తెలిసిందే. 119 మంది ఎమ్మెల్యేలకు గానూ 101 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. మరో 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయలేదు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ సభ్యులచే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణస్వీకారం చేయని వారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, మహేశ్వర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, కడియం శ్రీహరి, కేటీఆర్, వెంకట రమాణారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పైడి రాకేశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, పాయల్ శంకర్, రామారావు పవార్, రాజాసింగ్ ఉన్నారు.