హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 16 నుంచి చెక్కులను అందజేయనున్నట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. పథకం అమలు కోసం రూ.400 కోట్లు కేటాయించాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మైనార్టీల సమస్యలపై చర్చించేందుకు మంగళవారం సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశంలో మంత్రు లు హరీశ్రావు, మహమూద్అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాసయాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతోపాటు సీఎస్ శాంతికుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఉమర్జలీల్ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం, ఓవర్సీస్ సాలర్షిప్లు, శ్మశానవాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవవేతనం పొందే ఇమామ్, మౌజంల సంఖ్య పెంపు, క్రిస్టియన్ శ్మశానవాటికలు, ఆర్టీఎఫ్, ఎమ్టీఎఫ్ తదితర అంశాలపై చర్చించారు.
మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ… మైనార్టీ వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని వివరించారు. శ్మశానవాటికలకు 125 ఎకరాల స్థలం కేటాయించడంతోపాటు గౌరవవేతనం పొందే ఇమామ్, మౌజంల సంఖ్య పెంపు హామీలను ఇప్పటికే ప్రభుత్వం అమలుచేసిందని తెలిపారు. మైనార్టీలకు ఆర్థిక సాయం పథకం మొదటిదశలో భాగంగా ఎంపికచేసిన 10 వేల మంది లబ్ధిదారులకు ఈ నెల 16 నుంచి చెకుల పంపిణీ ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగాలని, మైనార్టీ జనాభా ఎకువగా ఉన్న నియోజకవర్గాలపై మరింత దృష్టి సారించాలని చెప్పారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. శ్మశానవాటికలు, ఈద్గా భూము ల కోసం వచ్చిన మొత్తం వినతులను క్రోడీకరించాలని, ఆ దిశగా పనులు వేగవంతం చేయాల ని చెప్పారు.
పహాడీషరీఫ్ దర్గా ర్యాంప్ పను లు, దర్గా బర్హన్షా అద్దెల సవరణ, క్రిస్టియన్ శ్మశానవాటికలు, ఆర్టీఎఫ్, ఎమ్టీఎఫ్, గ్రాంట్ ఇన్ ఎయిడ్.. ఇతర పనులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిషరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. షాదీముబారక్కు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి, లబ్ధిదారులకు వెంటనే ఉపశమన సొమ్ము అందేలా చూడాలని ఆదేశించారు.