హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం కొత్తగా 156 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 53, మేడ్చల్ మల్కాజిగిరిలో 22, రంగారెడ్డిలో 14, సిద్దిపేటలో 12, ఖమ్మంలో 11 కేసులు నమోదయ్యాయి. 3,642 మంది ఇండ్లు, దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 207 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో వైద్యారోగ్య సిబ్బంది సోమవారం 4.27 లక్షల మందికి కొవిడ్ టీకాలు వేశారు. మొదటి డోస్ 94,565 మందికి, రెండో డోస్ 3.32 లక్షల మందికి వేశారు. ఇప్పటివరకు మొదటి డోస్ 98 శాతం మందికి, రెండో డోస్ 59 శాతం మందికి వేశారు. 47.71 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. రిస్క్ దేశాల నుంచి సోమవారం హైదరాబాద్ విమానాశ్రయానికి 658 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిలో ఎనిమిది మందికి ఆర్టీపీసీఆర్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ నెల 16న దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తికి సోమవారం ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వెంటనే అతన్ని టిమ్స్కు తరలించారు.