టేకులపల్లి, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు హాజరయ్యేందుకు ‘మేము సైతం..’ అంటూ ఒకరోజు ముందే వారు పాదయాత్రగా బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ అభిమానుల ఆధ్వర్యంలో 150 మంది యువకులు మంగళవారం పాదయాత్రగా ఖమ్మం పయనమయ్యారు.
ఈ పాదయాత్రను రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు లక్కినేని శ్యామ్బాబు, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి ప్రవీణ్కుమార్, మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. బుధవారం మధ్యాహం వరకు సభా ప్రాంగణానికి యువకులు చేరుకుంటారు.