శంకరపట్నం, అక్టోబర్ 17: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో విజిలెన్స్, సివిల్ సైప్లె అధికారులు సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించారు. ఇందులో అక్రమంగా నిల్వ ఉంచిన 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం(illegal ration rice) పట్టుబడడంతో పాటు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 11 వేల క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి విజిలెన్స్ అధికారులు, కేశవపట్నం పోలీసులు కొందరి ఫిర్యాదుతో ఎస్వీ రైస్ మిల్లులో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా 30 బ్యాగుల్లో నిల్వ ఉంచిన 15 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించారు.
పోలీ సులు వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్ ఠాణాకు తరలించారు. అనంతరం రేషన్ బియ్యం స్వాధీనంపై ఎస్ఐ పీ లక్ష్మారెడ్డి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఇక సదరు మిల్లులో సీఎంఆర్కు సరిపడా ధాన్యం నిల్వలు లేవని విజిలెన్స్ అధికారులు పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందజేశారు.
మంగళవారం సివిల్ సైప్లె అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి సీఎంఆర్ డెలివరీ చేయాల్సిన 11 వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు తక్కువగా ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించినట్లు డీటీసీఎస్ వేణుగోపాల్ తెలిపారు. నివేదికను అదనపు కలెక్టర్కు అందజేయనున్నట్లు వెల్లడించారు.
కాగా, సదరు రైస్మిల్లు యజమాని బండారి సమ్మయ్యపై క్రిమినల్ కేసు లేదా ఆర్ఆర్ ఆక్ట్ కింద కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే, అక్రమ రేషన్ బియ్యం నిల్వలపైనా మరో కేసు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ సీఐలు ప్రశాంత్రావు, అనిల్కుమార్, విజిలెన్స్ తహసీల్దార్ దినేశ్, సివిల్ సైప్లె ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.