Road Accident | ఖమ్మం : ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై లోక్యాతండా వంతెన వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.