హనుమకొండ: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు వద్ద ఓ ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. బస్సు ఒంగోలు నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.