యాదగిరిగుట్ట : శ్రీ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి 15 రోజుల హుండీ ఆదాయం(Hundi income) రూ .1,23,89,437 వచ్చిందని ఆలయ అధికారులు (Temple Officials) వెల్లడించారు. మిశ్రమ బంగారం(Gold) 63 గ్రాములు రాగా , మిశ్రమవెండి(Silver) కిలో 970 గ్రాములు వచ్చిందని వివరించారు. అమెరికాకు చెందిన 1,566డాలర్లు , యూఏఈకి చెందిన 20 దిరామ్స్, ఆస్ట్రేలియాకు చెందిన 50 డాలర్స్,కెనడా డాలర్స్ 100 , న్యూజిలాండ్కు చెందిన 5 డాలర్స్ వచ్చాయని కార్యనిర్వహణాధికారి తెలిపారు.