Telangana | హైదరాబాద్ : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్శాఖలో పదోన్నతుల జాతర కొనసాగుతున్నది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ నుంచి సీఐ, డీఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ నుంచి ఎస్పీ ప్రమోషన్లు వచ్చాయి. ఇదే క్రమంలో సీఐ నుంచి డీఎస్పీ ప్రమోషన్లు కూడా వచ్చేశాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 141 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్రం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీలుగా ప్రమోషన్లు పొందిన వారందరికీ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా రాష్ట్ర హోం మంత్రి మహముద్ అలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు డీజీపీ అంజనీ కుమార్. మొత్తంగా కొంతకాలంగా ఎదురుచూస్తున్న సీఐల పదోన్నతుల కల నెరవేరింది.
It is a great feeling of joy to announce that on the occasion of Telangana Rashtra Avatarana Dashabdi Utsavalu Govt has promoted 141 Inspectors of Police (civil) to the rank of Dy. Supdts of Police (civil).
Hearty congratulations to all the police officers and gratitude to the…
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) June 22, 2023