హైదరాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ): రైతుబంధు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం మూడో రోజు 26.50 లక్షల ఎకరాలకు గాను 10.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1325.24 కోట్లు జమచేసింది. దీనితో కలుపుకొని ఇప్పటి వరకు ప్రభుత్వం 50.43 లక్షల మంది రైతులకు రూ. 3246.42 కోట్లను పంపిణీ చేసింది.
ఈ సందర్భంగా వ్యవసాయశాఖమంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని అన్నారు. కాబట్టే జనాభాలో అధికశాతం ఆధారపడిన వ్యవసాయరంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.