హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని ఐదు ప్రాంతాల్లో ముస్లింల కోసం మోడ్రన్ గ్రేవ్యార్డ్లు నిర్మించేందుకు ప్రభుత్వం 125 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఆయా ఉత్తర్వుల ప్రతులను మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం ప్రగతిభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వక్ఫ్బోర్డు ప్రతినిధులకు అందజేశారు. గ్రేవ్యార్డ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మోడ్రన్ గ్రేవ్యార్డ్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని సీఎం కేసీఆర్కు ఎంఐ ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గతంలో విజ్ఞప్తి చేశారు.
దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మజీద్పూర్లో 20 ఎకరాలు, తలకొండపల్లి మండలం ఖానపూర్లో 42.22 ఎకరాలు, కొందుర్గులో 10 ఎకరాలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం నూతనకల్లో 35.27 ఎకరాలు, శామీర్పేట మండలం తుర్కపల్లిలో 16.31 ఎకరాల చొప్పున మొత్త 125 ఎకరాలను గ్రేవ్యార్డ్ల నిర్మాణానికి కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రి మహమూద్ అలీ, వక్ఫ్బోర్డు చైర్మన్ మసిఉల్లాఖాన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నదని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బలాల, వక్ఫ్బోర్డు సీఈవో ఖాజా మొహినుద్దీన్, బోర్డు సభ్యులు నిజాముద్దీన్ హుస్సైని, నిసార్అహ్మద్, మైనార్టీ సంక్షేమశాఖ సెక్రటరీ ఒమర్జలీల్, సున్నీ, షియా, మహ్మదీయ, బొహ్ర, సులేమాన్ మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు.