భువనగిరి: దేశంలో కరోనా విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులతోపాటు ఎవరినీ మహమ్మారి వదలడంలేదు. ఫ్రెంట్లైన్ వారియర్స్ అయిన పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. మొత్తం 12 మంది సిబ్బందికి మహమ్మారి సోకింది.
యాదగిరిగుట్ట ఏసీపీ, సీఐ, 10 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. దీంతో వారంతా క్వారంటైన్లో ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలన్నారు.