హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): బొగ్గు ఉత్పత్తితోపాటు.. థర్మల్ విద్యు త్తు, సోలార్ విద్యుత్తు రంగాల్లోనూ రాణి స్తూ రూ.32 వేల కోట్ల టర్నోవర్, రూ.11,665 కోట్ల డిపాజిట్లు, ఏటా రూ.750 కోట్లకుపైగా వడ్డీ రాబడితో పూర్తి ఆర్థిక పరిపుష్టితో ఉన్న సింగరేణి సంస్థ అప్పుల పాలయ్యిందని కొంద రు చేస్తున్న దుష్ప్రచారాన్ని సంస్థ యాజమా న్యం తీవ్రంగా ఖండించింది. బుధవారం ఇం దుకు సంబంధించి ఒక వివరణాత్మక ప్రకటన విడుదల చేసింది. సింగరేణి పేరు ప్రతిష్ఠలను కించపరుస్తూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
☞ ఒకప్పుడు రూ.3,500 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్న సింగరేణి సంస్థ, నేడు తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేస్తేనే ఉద్యోగులు, కార్మికులకు జీతాలిచ్చే పరిస్థితికి వచ్చింది.
☞ సీఎస్ఆర్ పేరుతో ఏటా రూ.230 కోట్లను బీఆర్ఎస్ నాయకులు తమ సొంత అవసరాలకు వాడుకొన్నారు.
☞ రూ.500 కోట్లు బీఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లోనే ఖర్చు చేశారు.
☞ సింగరేణి పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రూ.కోట్లుకొద్ది సింగరేణి డబ్బు పరోక్షంగా ఖర్చు చేశారు.
☞ కరోనా వేళ రూ.400 కోట్లు తీసుకొన్నది.
☞ 2014లో టర్నోవర్ రూ.12 వేల కోట్లు ఉంటే.. ఈ రోజు 32,830 కోట్లు అని చెప్తున్నారు. ఈ లెక్కలు నమ్మశక్యంగా లేవు.
☞ రాష్ట్ర సర్కారు చూపుతున్న లెక్కల ప్రకారం రూ.1027 కోట్ల నికర లాభం ఉండాలి కదా?
☞ 2014తో పోలిస్తే మూడు రెట్లు సింగరేణి ఆదాయం పెరిగింది. కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ పుణ్యమా అని సంస్థ అప్పుల్లో కూరుకుపోయింది.
☞ సింగరేణి నిధుల విషయంలో దళారులు జోక్యం ఎక్కువైంది. సంస్థ పరిపాలన వ్యవస్థ అగమ్య గోచరంగా మారింది.
☞ సింగరేణి ప్రైవేటీకరణ అంటూ కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నది.
☞ దేశంలోని బొగ్గు గనులను సుప్రీంకోర్టు డైరెక్షన్లో ప్రైవేటు కంపెనీలకు బహిరంగ వేలంద్వారా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం 2020లో ఒక చట్టం తెచ్చింది.
☞ సింగరేణిలో అనేక అవకతవకలు జరిగాయి. రాజకీయ జిమ్మిక్కుతోనే కుట్ర జరుగుతున్నది.
☞ కోలిండియాలో ప్రతీ కార్మికుడికి రోజుకు సగటున రూ.930 వేతనం ఉంటే, సింగరేణిలో రూ.430 మాత్రమే చెల్లిస్తున్నారు.
☞ పరోక్షంగా బీఆర్ఎస్ నాయకులకు, ఆ పార్టీకి సింగరేణి కల్పవృక్షంగా మారింది.
☞ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను అన్నిరకాలుగా సంతృప్తి పర్చాలని, ప్రొటోకాల్ పాటించాలని సింగరేణి అధికారులు సర్క్యులర్ జారీ చేశారు.
☞ అధికార దుర్వినియోగానికి సింగరేణి యాజమాన్యం ఎర్ర తివాచీ పరుస్తున్నది.
☞ సింగరేణి పరిపాలన పూర్తిగా కుప్పకూలే పరిస్థితి ఉన్నది.
☞ 32 వేల కోట్ల టర్నోవర్తో నడుస్తున్న సింగరేణి పటిష్ఠ ఆర్థిక పునాదులను ని ర్మించుకొని ఇతర రాష్ర్టాల్లో వ్యాపారా న్ని విస్తరిస్తున్నది. ఒడిశాలో వచ్చే నెల లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నది.
☞ సింగరేణికి రూ.11,665 కోట్లు వివిధ బ్యాంకుల్లో, ఎల్ఐసీలో డిపాజిట్లు, బాండ్ల రూపంలో ఉన్నాయి. వీటి నుంచి ఏటా 750 కోట్ల వడ్డీ వస్తున్నది. దీనితోపాటు వినియోగదారుల నుంచి రావాల్సిన బకాయిలు 15,500 కోట్లకుపైగా ఉన్నాయి.
☞ దేశంలోని ఏ ఇతర ప్రభుత్వరంగ సంస్థ కూ డా చేపట్టని విధంగా సింగరేణి సంస్థ సుస్థిర ఆర్థిక పునాదుల కోసం థర్మల్, సోలార్ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసింది. సోలార్ విద్యుత్తు ప్లాంట్ల కోసం చేసిన 472 కోట్ల అప్పును ఇప్పటికే తీర్చింది. థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణం కోసం చేసిన 5,300 కోట్ల అప్పులో ఇప్పటికే దాదాపు సగం చెల్లించింది. ఇంకా చెల్లించాల్సిన అప్పు 2,800 కోట్లే. స్పష్టంగా చెప్పాలంటే సింగరేణికి ఉన్న అప్పు 2,800 కోట్లు మాత్రమే. కానీ, రూ.12 వేల కోట్ల అప్పు ఉన్నదని, కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉన్నదని చెప్పడం హాస్యాస్పదం.
☞ ప్రతినెలా 3న కచ్చితంగా జీతాల చెల్లింపుతోపాటు, ఏటా పెంచి చెల్లిస్తున్న లాభాల బోనస్, పీఎల్ఆర్ బోనస్లు కార్మికుల ఖాతాల్లో జమ చేస్తున్నది.
☞ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణి సంస్థ ఉత్పత్తి, టర్నోవర్, లాభాల్లో దేశంలోనే నంబర్ వన్ కంపెనీగా నిలిచింది. కార్మిక, ఉద్యోగుల సంక్షేమంలోనూ అగ్రస్థానంలో ఉన్నది. తెలంగాణ రాకపూర్వం సగటున ఒక కార్మికునిపై రూ.1.15 లక్షలు సంక్షేమానికి ఖర్చు చేయగా.. ఇప్పుడు రూ.3.15 లక్షలు ఖర్చు చేస్తున్నది. సంస్థ ఆర్థికంగా పటిష్ఠంగా ఉండటం వల్లనే ఇది సాధ్యమవుతున్నది
☞ ప్రతి ఏడాది సింగరేణి సంస్థ సమర్పించే స్పష్టమైన, లోపరహితమైన ఆర్థిక లావాదేవీల నివేదికలను పరిశీలించిన కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కొన్నేండ్లుగా మెచ్చుకొంటున్నది. అందు కే ఎలాంటి కా మెంట్లు కూడా చేయడం లేదు. ఇది కూడా సంస్థ నిజాయితీతో అమలు చేస్తున్న ఆర్థిక విధానాలకు గుర్తింపుగా పేర్కొనవచ్చు.
☞ రాష్ట్ర సాధన, అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న సింగరేణి సంస్థ కృషిని ప్రశంసించాల్సిందిపోయి, అందుకు భిన్నంగా కార్మికుల మనోధైర్యాన్ని, మార్కెట్లో కంపెనీ విలువను, పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసేలా మాట్లాడటం ఏ మాత్రం సరికాదు.
☞ పై అంశాలపై ఇంకా సమాచారం కావాలనుకొనేవారు కంపెనీ సెక్రెటరీనిగానీ, కంపెనీ ఇన్ఫర్మేషన్ అధికారినిగానీ సంప్రదించవచ్చు అని యాజమాన్యం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.