మేడ్చల్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానగోపురం స్వర్ణతాపడం కోసం మేడ్చల్ నియోజకవర్గం తరఫున రూ.11 లక్షల విరాళం అందిస్తున్నట్టు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మైల్స్టోన్ డెవలపర్స్ జీ రామకృష్ణారెడ్డి, ఏ వెంకట నర్సయ్య(బుజ్జీ) కలిసి ఈ మొత్తాన్ని అందించినట్టు వెల్లడించారు. విమానగోపుర స్వర్ణతాపడంలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజలు అదృష్టంగా భావించి, విరాళాలు ఇస్తున్నారని వివరించారు. నగదును దేవాలయ ఈవోకు అందజేయనున్నారు.