జయశంకర్ భూపాలపల్లి : కోటి ఆశలతో పదో తరగతి పరీక్షలు(10th Class Exams) రాసేందుకు వెళ్తున్న ఆ విద్యార్థిని జీవితంలో విషాదం అలుముకుంది. రోడ్డు ప్రమాదం(Road accident) ఆ బాలిక ఆశలను చిదిమేసింది. వివరాల్లోకి వెళ్తే..ఓ విద్యార్థిని తన సోదరులతో కలిసి పరీక్ష రాసేందుకు బైక్పై వెళ్తుండగా.. కాటారం మండలం మద్దులపల్లి శివారులో బైక్ కల్వర్టును(Culvert) ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కొత్తపల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని తోటపల్లి అక్షయ అపస్మారక స్థితిలోకెళ్లింది. అక్షయ అన్న రాజేష్, తమ్ముడు తరుణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అక్షయను 108 అంబులెన్స్లో భూపాలపల్లి దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.