Arogya Mahila | హైదరాబాద్ : మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఆరోగ్య మహిళ కేంద్రాలను మరో 100 వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త ఆరోగ్య కేంద్రాలను ఈనెల 12 న ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 272 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఉండగా, కొత్తవాటితో ఆ సంఖ్య 372కు పెరగనుంది. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళా వైద్య సిబ్బంది ఉంటూ, 8 రకాల ప్రధాన వైద్య సేవలను ఆరోగ్య మహిళా క్లినిక్స్ అందిస్తున్నాయి. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.