హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా, వేగంగా జరుగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గం గుల కమలాకర్ తెలిపారు. ఇదే రోజు నిరుటితో పోల్చితే 10 లక్షల టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేసినట్టు స్పష్టంచేశారు. శనివారం మంత్రుల నివాసంలో ధాన్యం కొనుగోళ్లపై గంగుల సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ.. గత సీజన్లో ఇప్పటి వర కు 27.84 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, ఈ సీజన్లో నవంబర్ వరకు 38.06 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈ ధాన్యం విలువ రూ.7,837 కోట్లు అని చెప్పారు. ఇప్పటికే 729 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ ముగిసిందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలు, పుషలమైన నీటి లభ్యతతో ఈసారి ధాన్యం నాణ్యత మరింత పెరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా ధాన్యానికి డిమాండ్ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు కూడా మద్దతు ధర కన్నా ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సివిల్ సైప్లె కమిషనర్ అనిల్కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణి పాల్గొన్నారు.