మహబూబ్నగర్, సెప్టెంబర్ 3: ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్లో ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ యూనియన్ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్కు క్రేన్ సాయంతో గజమాలను వేశారు.
అనంతరం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పాలమూరును కడుపు నింపే జిల్లా గా మార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో వడ్డెరబస్తీ అంటే ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు పట్టణంతో సమానంగా అభివృద్ధి జరుగుతున్నదని అన్నారు. లొల్లి పెట్టి కాలయాపనతో రాజకీయం చేసేవారికి అభివృద్ధి గురించి తెలియదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.