హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.73 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సీ సుదర్శన్రెడ్డి చెప్పారు. బీఎల్వోలు, ఎన్నికల అధికారుల పనితీరును అభినందించారు. నిర్ణీత గడువులోగా మిగిలిన అన్ని ఇండ్లకు 100% ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసేలా జిల్లాస్థాయి అధికారులు బీఎల్వోలను నిరంతరం ప్రోత్సహించాలని సూచించా రు. ‘సర్’-2026 ప్రక్రియపై సీఈవో సోమవారం బీఆర్కే భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘సర్’ ప్రక్రియ పురోగతిని సమీక్షించిన ఆయన క్షేత్రస్థాయి అధికారులకు పలు కీలక ఆదేశాలిచ్చారు. బీఎల్వోలు నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని చెప్పారు.