మణికొండ, జూలై 18: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రూ.కోటి విలువ చేసే 1.725 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్శాఖ అదనపు కమిషనర్ గాంధీ దొంతి మంగళవారం తెలిపారు. కువైట్ నుంచి దుబాయ్ మీదు గా సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికుడి నుంచి 1.225 కిలోల బంగారం, కువైట్ నుంచి దోహా మీదుగా వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద నుంచి 500 గ్రాము ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.