యాదాద్రి, జనవరి 26: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ విమానగోపుర స్వర్ణతాపడానికి అవసరమైన బంగారం కోసం విరాళాలు ఇచ్చేందుకు భక్తులు స్వచ్ఛందంగా ముం దుకు వస్తున్నారు. బుధవారం యాదాద్రి ఆలయ సూపరింటెండెంట్ గజవెల్లి రఘుబాబు రూ. లక్ష చెక్కు, యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన సూదగాని శ్రీహరి, రజని దంపతులు రూ. 50,216 నగదును ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బీ నర్సింహమూర్తికి అందజేశారు.