హైదరాబాద్: రాజధానిలో శుక్రవారం రాత్రి మూడు గంటలపాటు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) అప్రమత్తమయింది. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టింది. సహాయం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఏదైనా సహాయం అవసరమైనవారు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040 2111 1111, డీఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ 040 2955 5500, 9000 113 667 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
కాగా, శనివారం రాత్రి 7 గంటల నుంచి సుమారు మూడు గంటలపాటు భారీ వర్షం కురిసింది. దీంతో చాంద్రాయనగుట్ట పరిధిలోని పలు బస్తీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. జంగమ్మెట్ డివిజన్ లక్ష్మీనగర్ను వరద నీరు ముంచెత్తింది. లక్ష్మీనగర్లోని ఇండ్లలోకి భారీగానీరు చేరింది. జిల్లెలగూడలోని బాలాజీ కాలనీ జలదిగ్భంధమయింది. బాలజీ కాలనీలో నడుములోతులో నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దిల్సుఖ్నగర్, చైతన్యపురిలో భారీగా వరద ప్రవహిస్తున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.