ఉస్మానియా యూనివర్సిటీ, మే 3: ముఖ్యమంత్రి కేసీఆర్పై సోషల్మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య సీసీఎస్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కేసీఆర్ను విమర్శించడమే కాకుండా ప్రజలను రెచ్చగొట్టేలా అభ్యంతరకరమైన కంటెంట్తో మతకల్లోలాలు సృష్టించేలా పోస్టులు పెడుతున్న ఆర్జే కిరణ్మయి, శ్రీపద్ రెడ్డి బోర్గిలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. జంగయ్య వెంట టీఆర్ఎస్వీ నాయకులు నాగేందర్రావు కోదాటి, తరుణ్, నవీన్, చందు, సునీల్ తదితరులు ఉన్నారు.