హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే బీజే పీ, కాంగ్రెస్, శివసేన, ఆప్ తదితర పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీఆర్ఎస్లో చేరగా.. మరో కీలక నేత గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మాజీ ఎమ్మె ల్యే, మహారాష్ట్ర కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శంకరన్న దొండిగే, ఆయన కుమారుడు శివరాజ్ దొండిగే బీఆర్ఎస్లో చేరనున్నారు. ఎన్సీపీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్ష పదవికి శంకరన్న సోమవారం రాజీనామా చేశారు. అనంతరం బీఆర్ఎస్ కిసాన్ సెల్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదంతో భేటీ అయ్యారు. త్వరలోనే బీఆర్ఎస్లో చేరతానని ప్రకటించారు.