హైదరాబాద్ : ఈ నెల 25 తర్వాత హుజూరాబాద్లో ఎన్నికల సభ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో తెలంగాణ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, నేతల ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా నవంబర్ 15న వరంగల్ ప్రజాగర్జన సభను నిర్వహించాలన్నారు. మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలని సూచించారు.
ప్రతి రోజు 20 నియోజక వర్గాల సన్నాహక సమావేశాలను తెలంగాణ భవన్లో నిర్వహించాలన్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లడం లేదని ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందని, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. రెండేళ్లలో అన్ని పనులు చేసుకుందామని, మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పని చేయాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని స్పష్టం చేశారు.