ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 26: ఉస్మానియా వర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జూలై 5 వరకు పొడిగించినట్టు అధికారులు తెలిపారు. రూ.200 అపరాధరుసుముతో జూలై 8 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. లా కోర్సుల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జూలై 19 వరకు, రూ.200 అపరాధ రుసుముతో జూలై 29వ తేదీ వరకు పెంచినట్టు వెల్లడించారు. బీపీఈడీ, డీపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజును జూలై 13వ తేదీ వరకు, రూ.200 అపరాధ రుసుముతో జూలై 17వ తేదీ వరకు పొడిగించినట్టు వివరించారు.
వివిధ కోర్సుల పరీక్ష ఫలితాలు విడుదల
ఓయూ దూరవిద్యా కేంద్రమైన పీజీఆర్ఆర్సీడీఈ ద్వారా అందించే సైకాలజీ, ఇంగ్లిష్ పీజీ కోర్సులతోపాటు మూడేండ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్బీ ఆనర్స్, ఐదేండ్ల్ల బీబీఏ ఎల్ఎల్బీ, బీకాం ఎల్ఎల్బీ తదితర కోర్సుల సెమిస్టర్ పరీక్ష ఫలితాలను శనివారం విడుదలచేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు.
వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు 8 నుంచి
కరోనా నేపథ్యంలో ఓయూ పరిధిలో వాయిదా పడిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను జూలై 8వ తేదీ నుంచి, ఎంఈ పరీక్షలను జూలై 6వ తేదీ నుంచి, బీఫార్మసీ పరీక్షలను 11వ తేదీ నుంచి, బీసీఏ పరీక్షలను 15వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.