హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): మార్చి నెలలో అకాల వర్షాల కారణం గా నష్టపోయిన 1.31 లక్షల మంది రైతుల ఖాతాల్లో పంట నష్ట పరిహారం నిధులు సోమవారం నుంచి జమ కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎకరా కు రూ.10 వేల చొప్పున పంట నష్టపరిహా రం అందజేయనున్నారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం నూతన సచివాలయంలోని తన చాంబర్లో ఆసీనులైన వెంటనే ఇం దుకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు. అకాల వర్షాలకు 26 జిల్లాల్లో 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఇప్పటికే రూ.151.64 కోట్లను మంజూరుచేసింది.