నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా పలు వాహనాలను పోలీసులు పరిశీలించారు. రెండు ఆటోల్లో తరలిస్తున్న 44 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ అదనపు సీపీ వినీత్ తెలిపారు. ఈ కేసులో రెండు ఆటోలు, ఒక మోటార్ బైక్, 5 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.8 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.