కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, టీఆర్ఎస్ నేతలు మొదటి నుంచీ తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు రుజువుగా పార్లమెంట్ రికార్డులు ఉన్నాయి. పార్లమెంట్ లోపల, బయట అనేక సాక్ష్యాలున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ 17 సెప్టెంబర్ 2020న ఇవి నల్ల చట్టాలని, వీటితో కార్పొరేట్లకే లాభం, రైతులకు అన్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు. అదేమాట టీఆర్ఎస్ లోకసభ సభ్యుడు బీబీ పాటిల్ పార్లమెంట్లో చెప్పి, టీఆర్ఎస్ రైతు చట్టాలకు వ్యతిరేకమని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాజ్యసభలో టీఆర్ఎస్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఎంపీలు సంతోష్కుమార్ సహా హౌస్ లోపల, స్పీకర్ పోడియం వద్ద రైతుల పక్షాన నినాదాలు ఇచ్చారు. పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో ధర్నా చేసారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు రాజ్యసభలో మాట్లాడుతూ.. ఈ చట్టాలు రైతులను బానిసలను చేస్తాయని అన్నారు.
8 డిసెంబర్ 2020 నాడు రైతు సంఘాలు దేశవ్యాప్తంగా భారత్బంద్కు పిలుపునిచ్చాయి. కేసీఆర్ భారత్బంద్కు సంఘీభావాన్ని ప్రకటించడమే కాదు టీఆర్ఎస్ నేతలను రాష్ట్రవ్యాప్తంగా బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అన్ని జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పాల్గొని బంద్ని విజయవంతం చేశారు. 11 డిసెంబర్ 2020లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటించారు. ప్రధానితోపాటు హోంశాఖ, జల వనరులశాఖల మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత, ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రులను కలవడాన్ని ప్రతిపక్షాలు, మీడియాలో తెలంగాణ వ్యతిరేక సెక్షన్, కేసీఆర్ విధానాన్ని యూటర్న్గా ప్రచారం చేసింది. 30 డిసెంబర్ 2020న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎంఎస్పీని చట్టం చేయాలని డిమాండ్ చేశారు. తాము రైతు చట్టాలకు వ్యతిరేకమని స్పష్టంచేశారు. వాస్తవానికి మళ్ళీ పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్లో రాజ్యసభలో కేశవరావు 3 ఫిబ్రవరి 2021న, రైతు చట్టాలను కేంద్రం తేవడం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రసంగించారు. జనవరి 31న లోకసభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ రైతు చట్టాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు.
కొన్ని నెలల క్రితం రైతు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులను కేంద్ర మంత్రి అజయ్మిశ్రా కొడుకు ఆశిష్మిశ్రా కారు గుద్ది చంపినప్పుడు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దానిని హత్య అని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైతు చట్టాలపై విమర్శ చేయడం ఒకెత్తు అయితే, తెలంగాణ ప్రభుత్వంగా కేంద్రం వ్యవసాయ విధి విధానాలను ఎత్తి చూపెడ్తున్నారు. పార్లమెంట్లో రైతు చట్టాలపై టీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్రెడ్డి కనీసం సభకు హాజరు కూడా కాలేదు. అక్కడే రేవంత్రెడ్డికి తన పాత పార్టీ బీజేపీతో ఉన్న అనుబంధం బయటపడ్డది. రైతు వ్యతిరేక చట్టాలను ప్రవేశ పెట్టిన కేంద్రాన్ని ప్రశ్నించే బదులు, సభ నుంచి తప్పించుకొని టీఆర్ఎస్పై రాజకీయం చేసే ప్రయత్నం చేశాడు.
రాష్ట్ర మంత్రులు కే తారకరామారావు, గంగుల కమలాకర్ 1 సెప్టెంబర్ 2021న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసి వడ్లను కొనుగోలు చేయాలని కోరినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతిపక్షం నోరు మెదపలేదు. 25, 26 సెప్టెంబర్ 2021న, రెండు రోజులు వరుసగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి పీయూష్గోయల్ను ఉప్పుడు బియ్యం కొనుగోలు విషయమై కలిసినప్పుడు బాధ్యత లేకుండా బీజేపీ, కాంగ్రెస్ నేతలు రాజకీయ విమర్శలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్కు తెలంగాణ రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా? కేంద్రాన్ని లెక్కల రూపంలో, పత్రికల ద్వారా, ఢిల్లీ పర్యటన ద్వారా పార్లమెంట్లో, అసెంబ్లీ చర్చల్లో అన్ని అంశాలపై తెలంగాణ పట్ల కేంద్ర వైఖరిని టీఆర్ఎస్ నిలదీయడం కనిపియ్యదా? పూటకొక మాట తెలంగాణ వ్యతిరేకులవి, వారి స్వార్థానికి మోస్తున్న విషపత్రికలది. కేసీఆర్ స్టాండ్ ఎప్పటికి ఒక్కటే, తెలంగాణ సమాజం కోసం రాజీ లేని పోరాటం, దాని కోసం ధర్నా అయినా, ఢిల్లీలో దంగల్ కయినా వెనకాడరు.
రీసెర్చ్ స్కాలర్ఉస్మానియా యూనివర్సిటీ
పార్లమెంట్లో రైతు చట్టాలపై టీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్రెడ్డి కనీసం సభకు హాజరు కూడా కాలేదు. అక్కడే రేవంత్రెడ్డికి తన పాత పార్టీ బీజేపీతో ఉన్న అనుబంధం బయటపడ్డది. రైతు వ్యతిరేక చట్టాలను ప్రవేశ పెట్టిన కేంద్రాన్ని ప్రశ్నించే బదులు, సభ నుంచి తప్పించుకొని టీఆర్ఎస్పై రాజకీయం చేసే ప్రయత్నం చేశాడు.
దేశవ్యాప్తంగా 2020 డిసెంబర్ 8న రైతు సంఘాలు నిర్వహించిన భారత్బంద్కు సీఎం కేసీఆర్ సంఘీభావం ప్రకటించారు. బంద్లో పాల్గొనాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ అన్ని జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పాల్గొని బంద్ని విజయవంతం చేశారు.
రాష్ట్ర మంత్రులు కే తారకరామారావు, గంగుల కమలాకర్ 1 సెప్టెంబర్ 2021న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసి వడ్లను కొనుగోలు చేయాలని కోరినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతిపక్షం నోరు మెదపలేదు. 25, 26 సెప్టెంబర్ 2021న, రెండు రోజులు వరుసగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి పీయూష్గోయల్ను ఉప్పుడు బియ్యం కొనుగోలు విషయమై కలిసినప్పుడు బాధ్యత లేకుండా బీజేపీ, కాంగ్రెస్ నేతలు రాజకీయ విమర్శలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్కు తెలంగాణ రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా?
క్రిశాంక్ మన్నె
9959042687