హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాజ్యాం గ నిర్మాత డాక్టర్ అంబేదర్ ఆశయ సాధనకు బీఆర్ఎస్ కృషి చేస్తున్నదని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేరొన్నారు. దేశంలోనే తొలిసారిగా అంబేదర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా కేసీఆర్ అంబేదర్ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారని చెప్పారు. విగ్రహావిషరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గుంటూరు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాదుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.