హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల ఇంటర్ విద్యార్థులు సత్తా చాటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 92 మంది అబ్బాయిలు, 65 మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారు.
బాలుర విభాగంలో కే నందు 94.06%, డీ మనీశ్ 92.20%, ఎల్ గౌతమ్ 89.52%, ఏ రాము 89.32%, బాలికల విభాగంలో వీ శివాణి 89.38%, ఎం రజినీ 89.11% మార్కులను కైవసం చేసుకొన్నారు. 30 మందికిపైగా విద్యార్థులు 80శాతానికిపైగా మార్కులు పొందారు. విద్యార్థులను, బోధన సిబ్బందిని మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు.