ఖమ్మం: మినీ పురపోరు ఎన్నికల ఫలితాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఏడు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కార్పొరేషన్లోని 1, 10, 13, 14, 25, 37 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో కార్పొరేషన్లో ఆ పార్టీ ఇప్పటివరకు ఐదు స్థానాలను సొంతం చేసుకున్నది. ఇప్పటికే 10వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. కార్పొరేషన్లోని 1వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి హుస్సేన్, 13వ డివిజన్లో కొత్తపల్లి నీరజ, 25వ డివిజన్లో గొల్ల చంద్రకళ, 37వ డివిజన్లో ఫాతిమా గెలుపొందారు.
కాగా, కార్పొరేషన్లో కాగ్రెస్పార్టీ, బీజేపీ ఒక్కో స్థానం చొప్పున గెలవగా, ఇతరలు మరో రెండు చోట్ల విజయం సాధించారు. కార్పొరేషన్లోని మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. పట్టణంలోని ఎస్సార్ బీజీఎన్నార్ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. 10 కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు. ఒక్కో లెక్కింపు హాల్లో 6 డివిజన్ల ఓట్ల లెక్కింపు. మొత్తం 251 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..