‘పెద్దల మాట సద్దన్నం మూట’ అంటారు. 55 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అరిగోసలు పడ్డ రైతన్నలు తెలంగాణలో ఎవుసం ఎలా ఉందో చర్చించుకున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్కు చెందిన అన్నదాతల అసలు ముచ్చట మీరూ చదవండి..
మోత్కాని వెంకటయ్య: మల్లయ్య ఎట్టుంది ఎవుసం!
పుల్ల మల్లయ్య: బంధం చెరువునిండా నీళ్లుండగా ఎవుసం ఎటుపోతది. రెండోపంటకు గిన మస్తు నీళ్లున్నయ్.
గంగసాని రాజిరెడ్డి: ఇంతకుముందు చెరువులో నీళ్లసుక్కుండేదికాదు. ఎండకాల వొచ్చిందంటే గోజలకు కూడా శానతిప్పలయ్యేది. గిప్పుడు బోర్లళ్ల నీళ్ల ఊటలుకూడా పెరిగినయ్.
పడిగె మహంకాళి: చెరువునిండానీళ్లు, ఇంటింటికీ తాగేనీళ్లు, రైతుబంధు గివన్ని కేసీఆర్ చేసుట్లనే అయినయ్.
మోత్కాని వెంకటయ్య: కేసీఆర్ చేసిందాంట్ల కాంగ్రెసోళ్లు బుడ్డపైస మందం చేయలే.
గంగసాని రాజిరెడ్డి: కేసీఆర్ మీద ఆడొకడు, ఈడొకడు నిలవడ్డరట కదా!
మోత్కాని వెంకటయ్య: ఎంత మంది నిలవడ్తె ఏందే! ఊరందరికి మేలు చేసిన కేసీఆర్ను ఎట్ల మరుస్తం! రాముడెవ్వడో.. రాచ్చసుడెవ్వడో మనకి తెల్వదా!!
-రంగు శ్రీనివాస్