హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): విజయవాడ కనకదుర్గ ఆలయ పాలక మండలి సమావేశం చైర్మన్ రాంబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే పౌర్ణమి నుంచే భక్తులకు అమ్మవారి కుంకుమ ప్రసాదం అందించాలని నిర్ణయించారు.
ప్రతిరోజు 2 వేల మంది అన్న ప్రసాదం స్వీకరించేలా అన్నదాన భవన్ విస్తరించాలని, గుడికి ఎస్డీఎంబీసీ అందుబాటులోకి తేవాలని, ఏడాదిలోపు వయసున్న పిల్లలతో వచ్చే తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ఉండాలని, దూర ప్రాంత భక్తులకు మహా మండపం మొదటి అంతస్తులో డార్మిటరీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.