హైదరాబాద్ : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్తో ఆదివారం సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు. కరోనా వ్యాప్తి కారకులను గుర్తించి టీకా వేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సీఎం సూచనకు మంత్రి హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారు. ప్రధానితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.