హైదరాబాద్ : చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ లో ‘పోల్’ పేరిట రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై బాడీషేమింగ్కు పాల్పడడం దుర్మార్గమైనదని టీఆర్ఎస్వీ నాయకులు మండిపడ్డారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. యూట్యూబ్ ఛానల్ పేరిట వాడుతున్న భాష జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమైనదని.. దీనిని ఎవరూ అంగీకరించరని టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు నెమ్మాది శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు.
జర్నలిస్టులుగా చలామణి అవుతూ పత్రికా స్వేచ్ఛ పేరిట వాడుతున్న భాషను రాజకీయ విధానాల మీద కాకుండా కుటుంబ సభ్యులను వివాదాలకు లాగుతున్న ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలి. ఈ భాష జర్నలిస్టులు వాడదగినది కాదు. పత్రికా స్వేచ్ఛ పేరిట ఇదొక అన్యాయమైన అప్రజాస్వామిక చర్య. ఇది దుర్మార్గం. ఇది ప్రత్యేకంగా ఒక విద్వేషపూరితమైన ప్రాయోజిత ప్రచారంలో భాగంగానే జరుగుతుందని భావిస్తున్నాను. బీజేపీ పార్టీలో నాయకుడిగా చలామణి అవుతూ నేతల కుటుంబ సభ్యులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. బీజేపీ నేతల తీరుకు నిదర్శనం. తెలంగాణలో విద్వేషాలు రేపి.. అల్లరులను, మత విద్యేషాలను రెచ్చగొట్టే చర్యలకు బీజేపీ పూనుకుంటోందని అర్థం అవుతుంది. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు, ఇటువంటి చర్యలకు పాలుపడే పార్టీలకు, వ్యక్తులకు తగిన బుద్ది చెప్పాలని ఆయన కోరారు.