హైదరాబాద్ : నారాయణపేట్ జిల్లా కేంద్ర దవాఖానలో నూతనంగా నెలకొల్పిన ఐసీయూ క్రిటికల్ వార్డును మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. 10 ఐసీయూ పడకల వార్డును వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరోనా మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వైద్యరంగంలో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. గడిచిన ఏడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 1600 ఐసీయూ పడకలను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఇప్పటికే 5 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని, త్వరలో మరో 7 కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాయని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.