బార్లలో ఒంటిగంట వరకు మద్యం విక్రయాలు
హైదరాబాద్, డిసెంబర్ 28 : మద్యం ప్రియులకు శుభవార్త. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా మద్యం దుకాణాలు, బార్ల సమయాన్ని ప్రభుత్వం పెంచింది. ఈ నెల 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాల్లో విక్రయాలకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. బార్లలో 31వ తేదీ రాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయించేందుకు అనుమతించినట్టు పేర్కొన్నారు. ఈవెంట్ పర్మిషన్లు ఉన్న వారు సైతం ఒంటిగంట వరకు మద్యం సరఫరా చేసేందుకు అనుమతించారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ను ఆదేశించారు.