CM KCR Press Meet : ఓవైపు కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనం అని స్పష్టం చేసి చెప్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం మీరు వరి వేయండి.. ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వంతో కొనిపిస్తాం.. మెడలు వంచి.. తొడలు వంచి కొనిపిస్తం అని తెలంగాణ రైతులకు చెప్పడంపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదనతో చెప్పారు. మీరు పంట వేయకండి వరి అని చెప్పారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా.. ఒక పనికిమాలిన.. అవగాహన లేనటువంటి వ్యక్తి మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి మీరు వరి వేయండి. మెడలు వంచి కొనిపిస్తాం.. తొడలు వంచి కొనిపిస్తం అని మాట్లాడాడు. దాని మీద కేంద్ర మంత్రిని అడిగితే మావోడు బెవకూఫ్.. తప్పు చెప్పిండు అని చెప్పారు. అవగాహన రాహిత్యంతో మాట్లాడిండు అని చెప్పారు. నాకే డైరెక్ట్గా చెప్పారు. మంత్రులు పోయిన రోజు కూడా అదే చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అవగాహన రాహిత్యంతోనే మాట్లాడిండు అని చెప్పారు. మోసం చేసేది మీరు.. రైతులను ముంచేది మీరు. ఉల్టా మా మీద బదనాం చేస్తున్నారా? ఈ బురిడిగాళ్లను నమ్ముకుంటే మనం శంకరగిరి మన్యాలు పడుతాం.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.