CM KCR Press Meet : బీజేపీ ప్రభుత్వ పాలనలో భారతదేశంలో ఆకలి కేకలు పెరిగాయని సీఎం కేసీఆర్ ఆధారాలతో సహా నిరూపించారు. ధాన్యం సేకరణపై రాష్ట్ర కేబినేట్ భేటీ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సిగ్గు లేకుండా మాట్లాడారు. ప్రపంచ ఆకలి సూచికలో 116 దేశాల్లో సర్వే చేస్తే.. ఇండియా స్థానం 101. మీరు ఇప్పటికైనా కళ్లు తెరవండి. పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరవాలి. మన స్థానం ఎక్కడుందో చూసుకోండి. పాకిస్థాన్ స్థానం 92. బంగ్లాదేశ్, నేపాలు.. 76. ఇది మన బతుకు. మీరు మాట్లాడుతరు.. మా దగ్గర నిల్వలు ఎక్కువైనవి అని. ఏమైనా సంబంధం ఉందా? అప్పట్లో ఓ విప్లవ కవి రాశాడు. అన్నపు రాశులు ఒకవైపు.. ఆకలి కేకలు ఇంకోవైపు అని. ఇప్పడు అట్లే ఉంది కదా కథ. నీకు సామాజిక బాధ్యత ఉంటే.. ధాన్యం తీసుకొని పంచు.. ఫ్రీగా పంచు. గ్లోబర్ హంగర్ ఇండెక్స్ నిజమే కదా. వాస్తవమే కదా.
2016లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా స్థానం 96 ఉంటే.. ఇవాళ 101 కి దిగజారింది. ఇది మీ పరిపాలన. మీ ప్రభుత్వంలో భారతదేశంలో ఆకలి కేకలు పెరిగాయి.. అని సీఎం కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.