CM KCR Public Meeting | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించింది. గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి..రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఉద్యమాల గడ్డ, రాళ్లకు సైతం పోరాటాలను నేర్పిన మానుకోట గడ్డపై నుంచి సీఎం కేసీఆర్ గర్జించనున్నారు. శుక్రవారం మానుకోటలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు.