Telangana Assembly Election 2023: తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. కామారెడ్డిలో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు అక్కడ సుమారు 45 నిమిషాల పాటు ఓటింగ్ను నిలిపేశారు. కామారెడ్డిలోని ఆర్అండ్బీ బిల్డింగ్లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ నెంబర్ 253 లో ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓటింగ్ ప్రక్రియకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. అధికారుల స్పందించి సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అక్కడ ఓటింగ్ ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఈసారి గజ్వేల్తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి కె. వెంకట రమణా రెడ్డి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలంగాణలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదైంది.