హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 5వ రౌండ్ ముగిసే సమయానికి కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి , ఎమ్మెల్యే కే పి వివేకానంద భారీ మెజార్టీతో దూసుకెళుతున్నారు. కే పి వివేకానందకు 43,844 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డి కి 31, 808 , బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ 25, 554 ఓట్లు సాధించారు. దీంతో 5 రౌండ్లు పూర్తయ్యేసరికి వివేకానంద 12,036 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.