హైదరాబాద్: ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలింది. ఉప్పల్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy) ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. తనకు గౌరవంలేని కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని లక్ష్మారెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మేడ్చల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్(CM KCR) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, అంతకుముందు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను రాగిడి లక్ష్మారెడ్డి బుధవారం కలిశారు. ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ లక్ష్మారెడ్డి..తనకు గౌరవం లేని కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని, బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని లక్ష్మారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.