జనగామ : బీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆదరించండి మరిచిపోలేనంత అభివృద్ధిని చేసి చూపిస్తానని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుం దన్నారు.
ఆ పార్టీకి ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవన్నారు. సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. కర్ణాకటలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని గుర్తు చేశారు. కాగా, పల్లా ప్రచారానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీ వెంటే మేమంతా అంటూ మద్దతు తెలుపుతున్నారు. కారు గుర్తుకే ఓటేస్తామని హామీనిస్తున్నారు.