హైదరాబాద్ : ఎన్నికల సమయంలో మాయమాటలతో వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )అన్నారు. శుక్రవారం బన్సీలాల్ పేట డివిజన్లోని భోలఖ్పూర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్లకోసం గద్దల్లా వాలిపోతారని, ఎన్నికల అనంతరం అడ్రస్ ఉండరని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అత్యధికంగా నిరుపేదలు నివసించే హరిజన బస్తీలో అర్హులైన వారికి దళిత బంధు, పక్కా ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం క్రింద 3 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించే విధంగా కృషి చేస్తానని హామీనిచ్చారు.జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాల విజ్ఞప్తి చేశారు.
మంత్రి వెంట కార్పొరేటర్ హేమలత, మాజీ కార్పొరేటర్ సావిత్రి, పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు, ఏసూరి మహేష్, ప్రేమ్, శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మీపతి, మహేందర్, అరుణ్ గౌడ్, నాగలక్ష్మి, లక్ష్మి, అనితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.