హైదరాబాద్, అక్టోబర్ 24 : అభివృద్ధికి పట్టం కట్టి మరోసారి నియోజక వర్గం ఎమ్మెల్యేగా అవకాశం కలిపించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita Indra Reddy) అన్నారు. మంగళవారం అకాన్పల్లి సర్పంచ్ ముక్కెర యాదయ్య ఆధ్వర్యంలో ఆ గ్రామ నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నగరంలోని మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు రాజకీయాలకు అతీతంగా చేరుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీ రామ రక్ష అని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ ను ప్రజలు ఆశీర్వదించి, నియోజక వర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నానని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్రెడ్డి, కుమార్, సంజీవ వార్డు సభ్యులు పాల్గొన్నారు.