వనపర్తి,అక్టోబర్ 18 : సామాన్యులకు అండగా నిలిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్ర భుత్వమేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పోచమ్మ వీధిలో 3వ వార్డులో మంగళవారం రాత్రి వార్డు నిద్ర చేసిన అనంత రం బుధవారం ఉదయం 1,2 వార్డుల్లో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వాలు వృద్ధులకు అరకొర పిం ఛన్ అందజేసేవని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ వృద్ధులు గౌరప్రదం గా బతకాలని రూ.2,016పింఛన్ అందజేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.5 వేల వరకు పెంచి అందిస్తారన్నారు. అలాగే దివ్యాంగులకు గతంలో రూ.500 పింఛన్ ఉండేదని దానిని ప్రస్తుతం రూ.4016లకు పెంచారని, మళ్లీ ప్రభుత్వం ఏర్పడాక దాని ని కూడా రూ.6వేలకు పెంచనున్నట్లు తెలిపారు. బడుగు, బలహీన కుటుంబాలకు వంట భారం తగ్గించేందుకు తెలంగాణ ప్ర భుత్వం తరఫున సిలిండర్ను కేవలం రూ.400లకే అందించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రైతు కుటుంబానికి అం దిస్తున్న రైతు బీమా మాదిరిగానే ప్రతి కుటుంబానికి ధీమాను క ల్పించాలన్న సంకల్పంతో కేసీఆర్ బీమా పథకం ద్వారా రూ.5లక్షల ఇన్సూరెన్స్ తీసుకోస్తున్నట్లు తెలిపారు. అలాగే రేషన్ కార్డు ఉన్న కు టుం బాలకు ఇక నుం చి సన్న బియ్యం అందించనున్న ట్లు తెలిపారు. జిల్లాకేంద్రంలో అన్యాక్రాంతమైన చెరువులను పునరుద్ధరించి ట్యాంక్ బండ్లుగా మార్చామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో మరుగునపడిన స్థలాలను పార్కులుగా తీర్చిదిద్దామన్నారు. వాటిలో 11పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమేక వాటిలో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేయించామన్నారు. ప్రజల దాహార్తినీ తీ ర్చేందుకు రూ.425కోట్లతో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామ న్నారు. సామాన్యుల అ భ్యున్నతే ల క్ష్యంగా సీఎం కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారన్నా రు. నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణా లు పెంచే విధంగా మౌలిక వసతుల కల్పనలో వనపర్తి ముందు వరుసలో ఉందన్నారు. ఈఎన్నిక ల్లో బీఆర్ఎస్కి అండగా నిలవాలని, ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గ ట్టుయాదవ్, వార్డు కౌన్సిలర్ లక్ష్మీనారాయ ణ, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి, అక్టోబర్ 18 : తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లాలో కీలకంగా పనిచేసిన విద్యార్థినేత వనపర్తి మండలం చిమనగుంటపల్లి కి చెందిన ఉదయ్కిరణ్ బుధవారం మంత్రి నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. ముందుగా మంత్రి నిరంజన్రెడ్డి స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కీలకంగా పనిచేయాలని, ప్రభుత్వ మ్యానిఫెస్టోను ప్రతి గడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువనాయకులు పాల్గొన్నారు.