నల్లగొండ : బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. తాజాగా కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన చిక్కుల లింగ స్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మంది యువకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy )సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అభివృద్ధిని చూసే బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలువడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన వారిలో మధు, కిరణ్, సతీష్, మనోజ్, సతీష్. నవీన్, వెంకటేష్, ప్రవీణ్, విజయ్, ఉదయ్, రాజు, ఈశ్వర్, పోడిచేటి సందీప్, శివ, ఉపేందర్, పవన్, శ్రీకాంత్, మధు, నగేష్, శివాజీ, తదతరులు ఉన్నారు.
అలాగే కేతపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన వంగూరి జగన్, వంగూరి సుధాకర్, జిల్లా లింగయ్య ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి, బండపలెం రామాలయం చైర్మన్ మారం మీనా రెడ్డి, నకిరెకంటి సందీప్, నకిరేకంటి అనిల్, తదితరులు పాల్గొన్నారు.